11 May, 2026 | 2:44 AM

టెలికం బోర్డు జాతీయ సలహా సభ్యులుగా నారాయణ గౌడ్

05-02-2025 05:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): భారతీయ టెలికాం బోర్డ్ సలహా సభ్యులుగా నిర్మల్ కు చెందిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పున్నం నారాయణ గౌడ్ నియమించబడ్డారు. ఈ మేరకు జాతీయ టెలికం బోర్డు పొన్నం నారాయణ నియామక పత్రాన్ని అందించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో టెలికం రంగానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈయనను బుధవారం బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ నేతలు డాక్టర్ కృష్ణంరాజుతో పాటు సభ్యులు ఘనంగా సన్మానం చేశారు.