18-10-2025 10:38:16 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రోటరీ ఇండియా నేషనల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 సదరన్ రీజియన్ నవ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ నెల 17న బెంగళూరులో చాంచారి పెవలియన్ వేదికగా జరిగిన రోటరీ ఇండియా నేషనల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 సదరన్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా అతిథి ప్రెసిడెంట్, ఫిక్సీ, శ్రీమతి ఉమా రెడ్డి చేతుల మీదుగా నవ లిమిటెడ్ ప్రతినిధులు ప్రెసిడెంట్, యూనిట్ హెడ్ రేర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్ బాబు, కంపెనీ సెక్రటరీ & వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.రాజు, జనరల్ మేనేజర్ సి.ఎస్.ఆర్, ఎంజీఎం ప్రసాద్ అవార్డును అందుకున్నారు.
సామాజిక కార్యక్రమాలు (ఆరోగ్యం, విద్య, జీవనోపాదులు, ఇతర కార్యక్రమాలు) ద్వారా సామాజిక అభివృద్ధికి' నవలిమిటెడ్ చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డు దక్కిందని వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎఫ్ ఎల్ టి ఎల్ టి ఆర్ టి ఎన్ కే.పి నగేష్, డైరెక్టర్ రోటరీ ఇంటర్నేషనల్, అతిథిగా శ్రీమతి ఉమా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్సి, డి.జి వినోద్ సరౌజి, పిడిజి ఆర్.టి.ఎన్ జితేంద్ర అనేజ, ఆర్.టి.ఎన్ రామ్ కుమార్ శేషు, ఆర్.టి.ఎన్ త్రివిక్రమ్ జోషి పాల్గొన్నారు.