calender_icon.png 19 June, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుల నిర్లక్ష్యం.. రోగులకు శాపం..

19-06-2025 12:00:00 AM

  1. వైద్యులు స్థానికంగా ఉండరని ఆరోపణలు

డ్యూటీ టైమ్‌లో ‘సెలబేషన్స్’

రోగులను పట్టించుకోని డాక్టర్లు..? 

ఖానాపూర్, జూన్ 1౮ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపతిలో వైద్యుల నిర్లక్ష్యం రోగులకు శాపం గా మారింది. అసలే వానాకాలం ప్రారంభం.. పట్టణంలో, గ్రామాల్లో డయేరియా, జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో రోగులు ఆసుపతికి పరుగులు పెడుతున్నారు. కాగా అక్కడికి వెళ్లిన రోగులకు వైద్యుల నిర్లక్ష్యం మింగుడు పడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపతిలో సూపరింటెండెంట్‌తో పాటు మరో 14 మంది వైద్యులు అం దుబాటులో ఉండగా, అవుట్ పేషంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రోగులు ‘విజయకాంతి’ ప్రతినిధితో మొరపెట్టుకున్నారు.

కాగా వైద్యులు స్థానికంగా ఉండడం లేద ని ఆరోపణలు వెళ్లువెత్తుతున్న తరుణంలో కనీసం విధులు నిర్వహించే సమయంలో పూర్తిస్థాయి సమయం కేటాయించకపోగా, తాజాగా బుధవారం ఒక వైైద్యురాలి పుట్టినరోజు సం దర్భంగా డ్యూటీ టైమ్‌లో ఒక గదిలో కూర్చుని ‘సెలబేషన్స్’ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి? వైైద్యులు ఆ సుపత్రిలో ఉండేది కేవలం మూడు గంటలే, అయితే దానిలో రోగులు వున్న సమయంలో సెలబేషన్స్ కోసం అరగంట వృథా చేయటం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంధని పలువురు ఆరోపిస్తున్నారు.

రోగులను చడాల్సిన సమయంలో ఈ సెలబేషన్స్ ఏమిటని పలువురు పశ్నిస్తున్నారు. కాగా ఈ విషయం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువచ్చినా మామూలుగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైైద్యుల హాజరు, సమయ పాలన రిపోర్టు ఎప్పటికప్పుడు పైఅధికారులకు పంపించాల్సిన ప్రత్యేక ఉద్యోగి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆసుపతిలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సాగుతుందని..? రోగులు వాపోతున్నారు.

నిజానికి వైైద్యుల సమయ పాలన రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ప్రతిరోజూ చూసే అధికారి ఉంటాడన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఆ అధికారి నిఘా రిపోర్ట్ కలెక్టర్‌కు విన్నవించాల్సి ఉండగా ఆ అధికారి జాడ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రోగుల సమయం వృధా కాగా చివరి సమయంలో ఆదరాబాదరాగా కొంతమంది ఓపీ చూసి మళ్లీ రమ్మని తిరిగి పంపించడంతో, గత్యంతరం లేక ప్రైైవేట్ ఆసుపతులను ఆశయించాల్సి వస్తుందని రోగులు లబోదిబోమంటున్నారు.

దాంతోపాటు మహిళా రోగులు తమ వ్యక్తిగత సమస్యలను మహిళా వైైద్యులకు చెప్పుకుందాం అంటే.. ఆ వైైద్యురాలు చుట్టూ పురుష డాక్టర్లు  గుంపుగా ఉం డడంతో తమ సమస్యలు వివరంగా చెప్పుకోలేకపోతున్నామ ని పలువురు మహిళా రోగులు ‘విజయకాంతి’తో గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాకుండా డాక్ట ర్లు డ్యూటీ సమయంలో వారి యొక్క ఆప్రోన్ ధరించాల్సి ఉండగా సివిల్ దుస్తులుతో డాక్టరు ఉండడంతో డాక్టర్లను పోల్చుకోలేకపోతున్నామని అంటున్నారు.

ప్రభుత్వం పేదల మెరగైన వైైద్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా... డాక్టర్ల నిర్లక్ష్యం తో నిరుపేదలకు సరైన వైైద్యం అందకుండా పోతుందని పలువురు ఆరోపిస్తున్నారు?ఇకనైనా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ఖానాపూర్ ప్రభు త్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, రోగులు డిమాండ్ చేస్తున్నారు.