12 March, 2026 | 8:35 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

గ్రామాల్లో పచ్చదనం కోసం నర్సరీలు తప్పనిసరి

19-01-2026 02:50 PM

సర్పంచులు తప్పట్ల ఎల్లయ్య, చింతకుంట్ల మనోజ్

తుంగతుర్తి:  పచ్చదనాన్ని పెంపొందించడానికి ఏటా గ్రామాల్లో ప్రభుత్వం హరితహారం చేపడుతోంది. ఇందులో భాగంగా  గ్రామపంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పిస్తూ, నర్సరీ పనులను వేగవంతం చేశారు. దీనితో రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు. మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి గ్రామాలలో సోమవారం సర్పంచులు తప్పట్ల ఎల్లయ్య, చింతకుంట్ల మనోజ్ నర్సిల ఏర్పాటుకు అధికారులతో కలిసి, ముగ్గు పోసి ప్రారంభించారు.