8 April, 2026 | 4:22 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

మన సంస్కృతి, సంప్రదాయాలు ఎప్పటికీ మర్చిపోవద్దు

15-11-2025 12:00 AM

మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 14(విజయక్రాంతి): అత్యద్భుత ఆధ్యాత్మిక సమ్మేళ నానికి భాగ్యనగరం వేదికైంది. హైబిజ్ వన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్తీక మహోత్సవ వేడుకలు అమీర్‌పేట ధరమ్ కరణ్ రోడ్‌లోని ఎంసీహెచ్ గ్రౌండ్‌లో శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు హోమాలు, వ్రతా లు, అభిషేకాలు, పారాయణాలు మొదలైన పూజా కార్యక్రమాలను ఒకేచోట జరగనున్నాయి. మొదటి రోజు గణపతి హోమంతో మొదలై ఆపై వేదాద్రి అర్చకుల ఆధ్వర్యంలో మహా చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచం మొత్తం టెక్నాలజీలో వేగంగా ముందుకు సాగుతోందని.. మనం చాలా అభివృద్ధి సాధిస్తున్నాం..ఎన్నో ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అయితే మన మూలాలైన మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన సనాతన ధర్మం వంటి వాటిని ఎప్పటికీ మర్చిపోవద్దు అని అన్నారు. ధర్మాలను అనుసరించాలి.. హోమాలు, పూజలు తప్పకుండా చేయాలి‘ అని చెప్పారు.