3 July, 2026 | 11:38 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

బిచ్కుందలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

21-01-2026 03:16 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా  బిచ్కుంద పట్టణ కేంద్రంలో జనసేన పార్టీ  కార్యాలయన్ని బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ ప్రారంభించారు.   కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లేందుకు ఈపార్టీ కార్యాలయం కేంద్రబిందువు అవుతుందని, జనసైనికులకు మరింత అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తామని, ఈ కార్యాలయం నుండే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించలన్నారు. 

రానున్న స్థానిక బిచ్కుంద పట్టణ పురపాలక ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తామని అన్నారు.జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ ఆధ్వర్యంలో 50 మంది జనసేన పార్టీ లో  చేరారు.  జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.జన సేన నాయకులు మాట్లాడుతూ.. రాబోయే రోజులో పార్టీ ని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేసే వీధంగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.