2 July, 2026 | 6:59 PM

మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్లు

12-06-2024 01:49 AM

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్లు కేటాయించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 22  ల్యాం డ్ క్రూజర్లను  కొనుగోలు చేయగా, వాటిని  పలువురు మంత్రులకు కేటాయించారు. విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్ పనులను పూర్తికావడంతో ఆ వాహనాలను మంత్రుల వాహన శ్రేణిలో ప్రోటోకాల్ అధికారులు చేర్చా రు. గతంలో ఇవే వాహనాలపై వివా దం కొనసాగింది. అప్పటి  సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం ఖరీదైన 22 ల్యాండ్ క్రూజర్లను  విజయవాడలో దాచారని సీఎం రేవంత్‌రెడ్డినే చెప్పా రు. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.