ధర రూ.6.49 లక్షలు
ముంబై, మే 9: మారుతి సుజుకి తాజాగా కొత్త స్విఫ్ట్ మోడల్ ఎపిక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త డిజైన్, మెరుగుపర్చి న ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ధరను రూ.6.49 లక్షలుగా (ఎక్స్షోరూమ్) నిర్ణయించింది. ఈ కొత్త మోడల్ను రూ.1,450 కోట్ల పెట్టుబడితో డిజైన్ చేసి, అభివృద్ధిపర్చినట్టు కంపెనీ తెలిపింది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మారుతి స్విఫ్ట్ మోడల్ 9 రంగుల్లో లభిస్తుంది.