01-07-2025 12:08:22 AM
న్యూఢిల్లీ, జూన్ 30: కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్లో నిబంధనల అమలుపై రైల్వే బోర్డు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెంచిన కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్లు సోమవారం అర్ధరాత్రి 12 తర్వాతి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి చేసిన రైల్వే శాఖ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురా వాలంటూ అన్ని జోన్ల మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది.
సర్క్యులర్లో పేర్కొన్న విధంగా సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీ లే ఉండనున్నాయి. 501 నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్పై రూ.5, 1501 నుంచి 2500 కిలోమీటర్ల వరకు రూ.10, 2501 నుంచి 3వేల కిలోమీటర్ల వరకు రూ. 15 చొప్పున పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్లపై కిలోమీటర్కు అరపైసా చొప్పున పెంచగా.. మెయిల్/ఎక్స్ప్రెస్ (నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెంచారు.