ఎంపీ కావ్యను కలిసిన బార్ అసోసియేషన్ నూతన ప్రతినిధులు
హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఇటీవల నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు చకిలం ఉపేందర్, ప్రతినిధులు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలు, కోర్టు సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు న్యాయసేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం వంటి అంశాలపై చర్చించారు.
బార్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీ కావ్య హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం, కోర్టుల మౌలిక వసతుల పెంపు కోసం తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్తో పాటు సభ్యులను ఎంపీ అభినందించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు లలిత కుమారి, సాంబశివరాజు, ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.






