20-05-2025 03:34:53 PM
నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో హరిత కాలనీలో నూతన ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. వాసవి హరిత ఆర్యవైశ్య సంఘంగా పేరును నిర్ణయించీనట్లు వారు తెలిపారు. నూతన సంఘానికి అధ్యక్షులుగా సిద్ధంశెట్టి వెంకటేశం,కార్యదర్శిగా చిదుర ప్రశాంత్, కోశాధికారిగా బంధం శ్రీను,ఉపాధ్యక్షులుగా కొమిరిసేటి గంగరాజులు,సంయుక్త కార్యదర్శిగా జలిగాం రామకృష్ణ లను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఐక్యమత్యానికి ఈ సంఘం కృషి చేస్తుందని నూతన కార్యవర్గం ప్రతినిధులు పేర్కొన్నారు.