15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

30-12-2025 09:25 PM

పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్

విజయక్రాంతి,పాపన్నపేట: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలే తప్ప విషాదాన్ని మిగిలిచేలా చేసుకోవద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కున్న యువత భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడ వద్దని ఆయన సూచించారు. మద్యం మత్తులో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని, కుటుంబం వీధిన పడాల్సి వస్తుందని ఆయన సూచించారు. తాగి పోట్లాటలకు దిగొద్దన్నారు. ఎవరైనా మద్యం సేవిస్తే డ్రైవింగ్ కు డ్రైవర్ ను వినియోగించుకోవాలని సూచించారు. డిసెంబర్ 31తో పాటు జనవరి ఒకటిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.