30-05-2025 01:43:16 AM
హైదరాబాద్, మే 29: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ఉగ్రకుట్ర కేసు లో నిందితులు సిరాజ్ ఉర్ రెహ్మన్, సయ్యద్ సమీర్ను ఎన్ఐఏ అధికారు లు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి విజయనగరం చేరుకున్న ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్తో పాటు తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్బీ బృందాలు అక్కడే మకాం వేసి నిందితులను విచారిస్తున్నాయి.
ఈనేపథ్యంలో సిరాజ్, సమీర్తో సంబం ధాలు ఉన్నవారి కోసం గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్లలో నాలుగు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దీనిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సమీర్తో ఉగ్రలింకులు ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ఐఏకు సోదాల్లో తాము సహకరిస్తామ ని చెప్పారు. కాగా, సోదాల్లో సిరాజ్ నివాసంలో పేలుడు పదార్థాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.