29-06-2025 10:20:28 AM
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్(Uttarakhand) లో వరద బీభత్సం సృష్టించింది. ఉత్తరకాశీ(Uttarkashi) జిల్లాలో ఆదివారం తెలవారుజామున ఆకస్మికంగా కుండపోత వర్షం కురిసింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ వద్ద పని చేస్తున్న తొమ్మిది మంది కార్మికులు(Labourers Missing) గల్లంతయ్యారు. యమునోత్రి హైవేపై మేఘాల విస్ఫోటనం గురించి సమాచారం అందిందని బార్కోట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ దీపక్ కథైట్(Barkot Police Station SHO Deepak Kathait) తెలిపారు. ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికులు అక్కడ టెంట్లు వేసుకుని నివసిస్తున్నారని, ఇవాళ తెల్లవారుజామున కూరిసిన భారీ వర్షానికి వారు కొట్టుకుపోయి ఉంటారని అధికారులు ప్రకటించారు.
ఇప్పటివరకు తొమ్మిది మంది తప్పిపోయినట్లు సమాచారం. వారందరూ నేపాలీ మూలానికి చెందినవారని, వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. మేఘావృతం కారణంగా సిలై వంపుతో సహా అనేక చోట్ల హైవే మూసివేయబడింది. ఉత్తరకాశి జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్తుండగా బార్కోట్ ప్రాంతంలోని సిలై బెండ్ సమీపంలో భారీ వర్షం కురిసింది.
బార్కోట్-యమునోత్రి మార్గం కూడా తీవ్రంగా దెబ్బతిందని, దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. జిల్లాలోని కుత్నౌర్ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ భూమిని దెబ్బతీసినట్లు సమాచారం. ఓజ్రీ సమీపంలోని రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతింది. వ్యవసాయ పొలాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. స్యానచట్టిలోని కుప్డా కుంశాల త్రిఖిలి మోటారు వంతెన కూడా ప్రమాదంలో పడింది. భారీ వర్షం కారణంగా యమునా నది నీటి మట్టం కూడా పెరిగింది. కాగా, నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.