23-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 22 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో కల్తీకల్లు తయారీకి అవసరమయ్యే మత్తు పదార్థాల నిలువలకు నిర్మల్ అడ్డాగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మద్యం పాలసీలో భాగంగా వైన్ షాపులకు సరఫరా చేస్తున్న మద్యం ధరలు ఏడాదికి ఆ ఏడాది పెంచడం కారణంగా సామాన్య మధ్యతరగతి కార్మిక వర్గానికి చెందిన ప్రజలు మద్యం కొనలేని స్థితిలో ఉన్నవారు తెల్ల కల్లు వైపు ఆసక్తి చూపడంతో చూడడంతో నిర్మల్ జిల్లాలో కృత్రిమ రసాయనాలతో ఏర్పాటు చేసిన తెల్ల కళ్ళు విక్రయాలు చురుగా సాగుతున్నా యి.
ప్రభుత్వం కల్లుగీత కార్మికులను చేయూతనందించేందుకు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా తెల్ల కళ్ళు దుకాణాలకు లైసెన్సులను అందిస్తున్నారు. జిల్లాలో నిర్మల్ బైంసా ముధోల్ ఖానాపూర్ ప్రాంతాలతో పాటు ఆ యా మండలాలు గ్రామాల్లో కొందరు గౌడ కులస్తులు ఈత చెట్లు నుండి తయారుచేసిన కల్లును విక్రయిస్తూ నటిస్తూ గ్రామాల్లో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న స్థానికంగా మత్తు పదార్థాలతో తయారుచేసిన కల్లును మాత్రమే విక్రయిస్తున్నట్టు గ్రామాల్లో ప్రచారం జరుగుతుంది.
జిల్లాలో పోలీస్ ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలోనే ఈ కల్తీకలు విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ఈతవనాలు లేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఈత వాహనాలతో కొద్దిపాటి నీరాను తీసుకొచ్చి దాని మాటను వేల లీటర్లు క్లోరోహైడ్రేడ్ ఆల్ఫా జూమ్ మత్తు పదార్థాలతో కూడిన రసాయనులతో కల్తీ కళ్ళు తయారుచేసి గ్రామాల్లో లైసెన్స్ దుకాణాల ద్వారా బహిరంగ అమ్మకాలు చేపడుతున్న వాటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గీతా పారిశ్రామిక సంఘాల ద్వారా ప్రతినెల మా మూలు తీసుకుంటూ ఈ వ్యాపారానికి పూర్తి సహకారాలు అందిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 350 కి పైగా తెల్ల గళ్ళు లైసెన్సులు ఉండగా 450 గ్రాము లు తెల్లగల్లు దుకాణాలు నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి గ్రామ ము మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించవలసి ఉండగా తనిఖీలు నిర్వహించకపోగా ఉన్నత అధికారులు తనిఖీలకు వస్తే దుకాణదారులకు ముందస్తు సమాచారాన్ని ఇచ్చి ఈ వ్యాపారానికి ప్రోత్సహిస్తున్నారు.
నిర్మల్ కేంద్రంగా మత్తు పదార్థాల విక్రయం
నిర్మల్ జిల్లా కేంద్రంగా మత్తు పదార్థాల విక్రయం దందా జోరుగా సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కల్తీ కల్లుకు ఉపయోగించుకునే ఆల్ఫాజూ క్లోరోహైడ్రేడ్ నల్ల బెల్లం పట్టిక ఇతర రసాయనాలు నిర్మల్ కేంద్రంగా నిర్మల్ అదిలాబాద్ జగిత్యాల మంచిర్యాల జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లాలో పలుకుబడి ఉన్న కొందరు ఈ అక్రమ దందా వెనుక హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రతి నెలలో నిర్మల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ అధికారులు దాడులు నిర్వహించడం ఈ దాడుల్లో లక్షల రూపాయల విలువచేసే ఆల్ఫాజం క్లోరోహైడ్రేడ్ నల్లబెల్లం పట్టిక వంటి నిషేదిత మత్తు పదా ర్థాలు భారీ ఎత్తున లభ్యం కావడం వారిపై కేసులు పెట్టడం తర్వాత ఆ దందా తిరిగి కొనసాగించడం అలవాటుగా మారిపోయిందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
గతంలో తెల్లగళ్ళు గుడుంబా విక్రయాలకు వికరించి మత్తు పదార్థాల ను మహారాష్ట్ర నుండి దిగుమతి చేసుకొని వివిధ గ్రామాలకు సరఫరా చేసేవారు. దుకాణదారులు ఆర్డర్ ఇస్తే వారు నేరుగా సరఫ రా చేసేవారు. కానీ ఇప్పుడు నిర్మల్ చెందిన వారి ఇక్కడ స్థావరంలో ఏర్పాటు చేసుకొని వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చిట్యాల మండలంలోని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా తయారు చేస్తున్న ఆల్ఫాజూ క్లోరోడ్ మత్తు పదార్థాల కేంద్రం పై దాడులు నిర్వహించి 25 లక్షల విలువ చేసే మొత్తు పదార్థాలతో పాటు రెండు వాహనాలు ముగ్గురు వ్యక్తులను రెడ్డెండ్ గా పట్టుకొని అరెస్టు చేయడం ఈ దందాకు ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మూడు నెల క్రితం శాంతినగర్ కాలనీలో ఇదే తర దాడులు నిర్మించగా 30 లక్షల మత్తు పదార్థాలు లభించాయి. మత్తు పదార్థాల విక్రయం రవాణా చేయడం విలువ చేయడం చట్టరీత్య నేరమైనప్పటికీ గౌడ కులస్తులు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని ఎంచుకొని మూడు పూవులు ఆరు కాయలుగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ దందాను గుర్తించిన గౌడ కురస్తులే ఉన్నతాధికారులకు అక్రమ మత్తు పదార్థాల పై సమాచారం ఇచ్చి పట్టించినట్టు ప్రచారం జరుగుతుంది. నిర్మల్ బైంసా మామడ ఖానాపూర్ కుంటాల కుబీర్ లోకేశ్వరం దిల్వార్పూర్ సోన్ తదితర ప్రాంతాల్లో కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
నిర్మల్ జిల్లాలో కల్తీ తెల్లకళ్ళు విక్రయాలు జోరుగా సాగుతున్న నేప థ్యంలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. కల్తీ కళ్ళు తాగి విని యోగిస్తున్న ఆల్ఫాజం క్లోరోహైడ్రేడ్ నత్రజని నత్రజని రైతుల పదార్థాలను వాడకం చేయడం వల్ల ఆ కల్లులు తాగిన వారు మత్తు ఎక్కువగా రావ డం తల తిరగడం కాళ్లు చేతులు గుం జడం శారీరక సంబంధ వ్యాధులకు గురవుతున్నారు.
మత్తు అధిక మోతాదులో ఉండడం వల్ల తాగిన వారు ప్రమాదాన్ని గురైతే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జిల్లాలో నిరంతరం జరుగుతున్నాయి. తెల్లగల్లు అతిగా తాగడం వల్ల ఆహారం సరిగ్గా తినకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ఆసు పత్రిలో వేలాది రూపాయలను ఖర్చు పెట్టుకుంటున్నారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కళ్ళు తాగిన వారు బోల్తా పడితే వెంటనే చనిపోతున్నారు.
దుకాణం దారులు వారి కుటుంబాలకు కొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటు న్నారు. ఈ కల్లుకు బానిస కావడంతో ఇంట్లో ప్రతిరోజు కుటుంబ సభ్యులతో గొడవలు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు హింసలకు పాల్పడడం వల్ల కుటుంబంలో గొడవలు ఏర్పడి కుటుంబ సభ్యులు అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు.
జనవాసాల మధ్యనే దుకాణా లు నడపడం వల్ల పక్కింటి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ దేవాల యాలు ఆసుపత్రులు పాఠశాల దగ్గరగా దుకాణాలు ఇళ్ల మధ్య ఉండవ ద్దన నిబంధన ఉన్నప్పటికీ చాలా నిబంధనం అమలు కావడం లేదు. గ్రామాల్లో డీటీసీ కమిటీలకు కొంత డబ్బు చెల్లించి వారు ఈ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.