23-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 22 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ప్రజా రంజక పాల న సాగిస్తుందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారు అన్నారు. సారంగాపూర్ మండలం దని గ్రామానికి చెందిన కుంటాల భోజన్న,మేకల సాయన్న ,పీసరి పోశెట్టి, కావేరు దేవన్న,పెద్దగొల్ల మల్లయ్య, రామ్ సత్యం, ఊరే భోజన్న,గొల్లమాడ నారాయణ తదితరులు 50 మంది బీజేపీ నాయకులు అదివారం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు గారి సమక్షంలో బీజేపీ పార్టీ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీహరి రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తున్న ఘనత కాం గ్రెస్ ప్రభుత్వాన్నిదన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ 500 కే గ్యాస్, రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ పథకాలను అమలు చేసి , ఇందిరమ్మ ఇల్లు, ,యువకులకు రాజీవ్ యువవికాసం తో అరుహులైన ప్రతి ఒక్కరికి 50,000 నుండి 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓరవలేక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పార్టీ పై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది,నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ్రు రామ్ రెడ్డి, నరేష్ రెడ్డి, విలాస్ రావు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు