11 May, 2026 | 5:12 PM

సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా: కేటీఆర్

29-08-2024 12:13 PM

రుణమాఫీ లేదు.. రైతు భరోసా లేదు

హైదరాబాద్: రుణమాఫీ కాని రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ అనుమానిస్తోందని కేటీఆర్ అన్నారు. రైతుల సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త నాటకాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాసప్.. ఇప్పుడు రైతు రుణమాఫీతో వాపస్ ఆప్షన్ ఆ అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే.. మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రుణమాఫీపై మంత్రులు, సీఎం జూటా మాటలు చేప్తున్నారని విమర్శించారు. ఒక రుణమాఫీ చేయడానికి వంద కొర్రీలు, సెల్ఫీ దిగి తాను రైతు అని అన్నదాత నిరూపించుకోవాలా?  అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ కొత్త నాటకాలు చేస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ లేదు.. రైతు భరోసా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రావడంతో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయన్నారు.