03-12-2025 10:56:03 PM
కొల్చారం (విజయక్రాంతి): కొల్చారం మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 21 గ్రామపంచాయతీలకు గాను 8 మంది మాత్రమే సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేశారని, 192 వార్డులకు గాను 19 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేసినట్లు ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం తెలిపారు. మరో రెండు రోజులపాటు నామినేషన్లకు అవకాశం ఉన్న రేపధ్యంలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.