31 March, 2026 | 8:08 PM

దుండిగల్ లో బీజేపీ నూతన డివిజన్ అధ్యక్షుల నామినేషన్

31-03-2026 06:52 PM

కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి విస్తరణ అనంతరం దుండిగల్ సర్కిల్ మూడు డివిజన్లుగా ఏర్పాటు అయ్యింది. బహదూర్ పల్లి 294,బౌరంపేట్ 295,దుండిగల్ 296 గా ఏర్పాటు జరిగింది. మంగళవారం బహదూర్ పల్లి, దుండిగల్ డివిజన్ల బీజేపీ అధ్యక్షుల ఆశావహుళ పేర్లు సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీకి పంపించారు. బహదూర్ పల్లి డివిజన్ నుండి అకిబోయిన శ్రీనివాస్ యాదవ్, కావలి సంతోష్, డి.యశ్వంత్, దుండిగల్ డివిజన్ నుండి ఆకుల విజయ్ సాయి, తురాయి భాను గౌడ్,

మాలోత్ వెంకటేష్ నాయక్, తలారి రాజ్ కుమార్, భాస్కర్ నాయక్, తలారి రాజ్ కుమార్, భాస్కర్ నాయక్, నడికట్ల రోజా నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ  బీజేపీ ఒక సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ అని అన్నారు. పదవుల కోసం కాకుండా జాతీయ భావం దేశభక్తి కలిగి ఉండాలని, కార్యకర్తలు, నాయకులు కలసిమెలసి ఒక కుటుంబంలా ఉండాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో దుండిగల్ సర్కిల్ మూడు డివిజన్ లలో బీజేపీ జెండా ఎగరవేయ్యాలని పిలుపునిచ్చారు.