31 July, 2026 | 8:19 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

కేసీఆర్ మీద కుట్ర కాదు..కాళేశ్వరం మీద కుట్ర

03-09-2025 12:36 AM

బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజ యక్రాంతి): సీబీఐ విచారణ అనేది కేసీఆర్ మీద చేసిన కుట్ర కాదు, తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం మీద, తెలంగాణ ప్రజల మీద చేసిన కుట్ర అని బీఆర్‌ఎస్ నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శిం చారు. కాళేశ్వరంపై అనేక అపో హలు, కాంగ్రెస్ బురద రాజకీ యం, అసెంబ్లీలో చర్చ, జస్టిన్ పీసీ ఘోష్ కమిషన్ నేపథ్యం లో నిజానిజాలు ప్రజల మధ్య పెట్టాలన్న ఉద్దేశ్యంతో గత నెల 28, 29, 20 తేదీలలో 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజె క్ట్ మొత్తం స్టడీ టూర్ చేసినట్లు ఆయనత తెలిపారు. దానికి సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తెలం గాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్ల డించారు.