15-11-2025 01:33:00 AM
సీఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్, నవంబర్ 14: ప్రతి కశ్మీరీ ముస్లిం ఉగ్రవాది కాదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయకులను ఇంత క్రూరంగా చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదని తెలిపారు.
ఈ మేరకు జమ్మూలో మీడియాతో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. ఇక్కడి శాంతి, సోదరభావాన్ని కొందరు మాత్రమే నాశనం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ప్రతి నివాసి, ప్రతి కశ్మీరీ ముస్లింను ఉగ్రవాది అనుకుంటే ఇక్కడి ప్రజలను సరైన మార్గంలో ఉంచడం కష్టమని, పేలుడుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.