12 June, 2026 | 5:32 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

వృక్షమాత తిమ్మక్క ఇకలేరు

15-11-2025 01:31 AM

బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

బెంగళూరు, నవంబర్ 14 : కర్ణాటకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వృక్షమాత సాలుమరద తిమ్మక్క (114) కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.

వేలాది మొక్కలు నాటి జీవితాన్ని వాటి సంరక్షణకు పాటుపడిన  తిమ్మక్క ఎప్పటికీ ప్రజల మనసులో నిలిచిపోతారని పేర్కొన్నారు. 1911 జూన్ 30న జన్మించారు. ఆమె చేసిన నిస్వార్థ సేవకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అంతే కాకుండా ఆమె ఇందిరా ప్రియదర్శిని, నాడోజా, వృక్షమాత తదితర అవార్డుతో పాటు గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.