20-12-2025 01:56:13 AM
ఈ మధ్య కాలంలో పాజిటివ్ వైబ్ వచ్చిన చిన్న సినిమాల్లో ‘మిస్టీరియస్’ ఒకటి. సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీతో వస్తుందని ప్రమోషనల్ కంటెంట్తో తెలిసిపోయింది. అంతేకాక ప్రీ రిలీజ్ ఈవెంట్కు బ్రహ్మానందం రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అలాంటి సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ: కొండపూర్ ఎస్సై రాంఖీ/రామ్కుమార్ (అబిద్ భూషణ్) అదృశ్యం అవుతాడు. ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఏసీపీ ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని) అతని భార్య శిల్ప (మేఘన రాజ్పుత్)ను విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్ కేసుకు విరాట్ శిల్పలకు సంబంధం ఏంటి? విరాట్ కొన్న విల్లాకు రాంఖీ ఎందుకు వెళ్లాడు? ఈ కథలోకి మిస్సిరా (రియా క పూర్) ఎందుకు వచ్చింది? అసలు ఎస్సై రాం ఖీని ఎవరు చంపారు? అనే ట్విస్టులు, సస్పెన్స్తో సినిమాలో చూపించారు.
విశ్లేషణ: సినిమా చూస్తున్నంత సేపు మన సాధారణ జీవితంలో వచ్చే కొన్ని ముక్కోణ ప్రేమకథలు మనకు గుర్తొస్తాయి. అలాంటి కథకే కొన్ని ట్విస్టులు ఆద్యంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి, కొన్ని జాగ్రత్తలు తీసుకుని డైరెక్టర్ కథ రాసుకున్నట్టు అర్థమైపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి.. డైరెక్టర్ పాత్రల పరిచయం విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా డైరెక్టర్ మెయిన్ ప్లాట్కి వెళ్లిపోయాడు. ఇటు కథను కొనసాగిస్తూనే.. పాత్రలను పరిచయం చేస్తూ, వెనువెంటనే ట్విస్టులు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ప్రేక్షకులకు అసలు కిల్లర్ ఎవరూ అనే సందేహం క్లుమైక్స్ వరకు అలాగే ఉంటుంది.
అలా ప్రేక్షకులను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత వరకు సక్సెస్ అయినట్టే. ఇంటర్వెల్లో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. కథను నెక్ట్స్ లెవెల్కు తీసుకుళ్లే ప్రయ త్నం చేశాడు. ఇప్పటికే సినిమాలో వచ్చే ట్విస్టులు సస్పెన్స్, థ్రిల్లర్ను ఫీల్ అయ్యే ప్రేక్షకులకు సెకండాఫ్లో ఉండే హర్రర్ ఎలిమెం ట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. ఇక క్లుమైక్స్లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్ సినిమాను మలుపు తిప్పుతుంది. అప్పటివరకు కిల్లర్ వీరే అని అనుకునే ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. అయితే, కథ వరకు అంతా బానే ఉన్నా.. నటీనటుల విషయంలో డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగుండేది. అంటే.. ఇప్పుడున్న నటీనటులు అంత తెలిసిన ఫేసు లు కాకపోవడం ఓ మైనస్ అని చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే..
దాదాపు అందరూ బాగా చేశారు. మెయిన్ లీడ్లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్పుత్, అబిద్ భూషణ్ అద్భుతంగా చేశారు. సీనియర్ పోలీస్గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. అలాగే జబర్దస్త్ ఫేమ్ రాజమౌళికి మంచి పాత్ర పడింది. బాగా నటించాడు కూడా ఆయన. అలాగే మరో జబర్దస్త్ నటుడు గడ్డం నవీన్ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బాగానే చేశాడు. ఇక మ్యూజిక్ ఎంఎల్ రాజా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సరైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్గా చేసిన పరవస్తు దేవేంద్ర సూరికి మంచి మార్కులు వేయొచ్చు. అయితే.. ఇదే సూరి ఎడిటర్గా కూడా ఈ మూవీకి వర్క్ చేశాడు. ఈ ఎడిటింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవా ల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగా కుదిరాయి. చివరగా చెప్పొచ్చేదేంటంటే, ‘మిస్టీరియస్’.. మిస్ చేయకుండా ఓ సారి చూడాల్సిన సినిమా.