calender_icon.png 6 June, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త జిల్లాలకు నోటిఫికేషన్లు వేయాలి

31-05-2025 12:00:00 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, మే 30 (విజయ క్రాంతి) : కొత్త జిల్లాలకు, ఇతర ఆఫీసులకు అదనపు పోస్టులు సృష్టించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ 6 ఏళ్ల క్షితం కొత్తగా 23 జిల్లాలు ఇతర ఆఫీసులో పెద్ద ఎత్తున సృష్టించి మంజూరు చేశారన్నారు.

కానీ వీటికి ఇంత వరకు పోస్టులు సృష్టిం చే మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా సాగాలంటే ఇన్చార్జిలతో పూర్తిస్థాయి అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ విఠల్, రఘు, అనంతయ్య, నీలం వెంకటేష్, వెముల రామకృష్ణ, సీ.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.