calender_icon.png 2 June, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11గంటలకుపైగా శ్రవణ్‌రావు విచారణ

09-04-2025 01:52:10 AM

  1. ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరు
  2. పలు పత్రాలు, ఫోన్లతో వచ్చిన శ్రవణ్‌రావు 
  3. గత ఎన్నికల సమయంలో ఎవరెవరితో మాట్లాడారు.. అనే కోణంలో ఆరా
  4. ఫోన్లు, వాట్సాప్ డాటాను విశ్లేషిస్తున్న సిట్ అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగం గా మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోని సిట్ కార్యాలయం లో విచారణకు ఆయన హాజరయ్యారు. శ్రవణ్‌రావు సిట్ విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 11 గంటలకు పైగా సిట్ అధికారులు ఆయన్ను విచారించారు.

కాగా 2023 ఎన్నికల సందర్భంగా వినియోగించిన సెల్‌ఫోన్లతో విచారణకు హాజరుకావాలని సిట్ అధి కారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయ న పలుపత్రాలు, సెల్‌ఫోన్లతో విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన్లలోని డాటా ఆధా రంగా సిట్ అధికారులు శ్రవణ్‌రావును ప్రశ్నిం చి అందులోని సమాచారాన్ని విశ్లేశిస్తున్నారు.

2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు ఎవరితో మాట్లాడారు.. ఆయనతో ఫోన్లు మాట్లాడిన వ్యక్తులు ఎవరు.. ఆసమయంలో ఆయనకు వచ్చిన ఫోన్ల వివరాలు.. వచ్చిన ఫోన్ నెంబర్లు.. వాట్సాప్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎవరు చెబితే నాటి ఎస్‌ఐబీ అధికారులకు ఫోన్‌నంబర్లు పంపారు.. దాంతో ఎవరికి లబ్ధి చేకూరిం ది అని విశ్లేషిస్తున్నారు. కాగా అధికారులు అడిగిన ప్రశ్నలకు కొన్ని గుర్తులేవని చెబుతున్నట్లు సమాచారం. కొన్ని ఫోన్ నంబర్ల వివరాలు మాత్రమే చెప్పినట్లు తెలిసింది. 

ఫోన్‌ట్యాపింగ్‌కు పరికరాలుఎవరు సమకూర్చారు?

ఫోన్‌ట్యాపింగ్‌కు ఉపయోగించిన పరికరాలను సమకూర్చింది ఎవరు? దానికి సంబం ధించిన సర్వర్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారనే అంశాలపై సిట్ అధికారులు సమాచా రాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తి ఎవరు..ఆ వ్యక్తి ఆదేశాల మేరకు ఏమేం చేశారనే కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. కాగా శ్రవణ్‌రావు విచారణ పూర్తయితే కీలక పరిణామాలు చోటుచే సుకునే అవకాశం ఉంది.

కాగా, గతంలో జరిగిన మునుగోడు, దుబ్బాక ఉపఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్‌చేయడంలో శ్రవణ్‌రావు కీలకంగా వ్యవహరిం చాడని సిట్ అధికారులు భావిస్తున్నారు. దీం తో ఫోన్‌ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావు విచారణే కీలకంగా మారనుంది. ఈ కేసులో నింది తులుగా ఉన్న వారిలో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహా మరో ముగ్గురు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో శ్రవణ్‌రావే తమకు నంబర్లు పంపారని, అందుకే నంబర్లను ట్యాప్ చేశామని చెప్పారు. ఈ కేసు లో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు తనను అరెస్ట్ చేయొద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు.