24-04-2025 01:23:54 AM
మోతే, ఏప్రిల్ 23:- పుట్టిన గ్రామాన్ని చదువుకున్న పాఠశాలని ఎంత పెద్ద స్థాయికి ఎదిగిన మరవద్దని ఎన్నారై కంచర్ల ఉపేందర్ నాయుడు అన్నారు బుధవారం మండల పరిధిలోని నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన తండ్రి చిన్నతనంలో చదువుకున్న పాఠశాలకు తన వంతు సహాయంగా పాఠశాలలో విద్యార్థులు చదువుకునేందుకు గదులు సరిపోను లేకపోవడంతో తన తండ్రి కంచర్ల రామకృష్ణయ్య తల్లి సుగుణ దేవిల జ్ఞాపకార్థంగా ఏడు ఎనిమిది తరగతుల గదుల నిర్మాణాలను పాఠశాల సిబ్బంది అడగగానే సుమారు 18 లక్షల పైబడి అందజేసి నిర్మాణాలు చేపట్టాడు నేడు పాఠశాల గదులను ప్రారంభించి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలలు పోతున్న సమయంలో పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఎన్నారై కంచర్ల ఉపేందర్ నాయుడుని ఉపాధ్యాయులు విద్యార్థులు మేళ తాళాల నడుము నూతన గల నిర్మాణం చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు శాలువ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి ఎల్ ఎన్ చారి, ఉపాధ్యాయులు కొత్తపల్లి రాంరెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.