24-06-2025 05:21:48 PM
చండూరు (విజయక్రాంతి): చండూరు ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అమెరికాకు చెందిన నంద్యాల కిరణ్ కుమార్ రెడ్డి పదివేల ఆర్థిక సహాయం అందించారు. గత పదవ తరగతి ఫలితాలలో స్కూల్ టాపర్ గా నిలిచిన సరిపెల్లి మోనికకు ఐదువేలు, ఎన్ఎంఎంఎస్ పరీక్ష(NMMS Exam)లో ఎంపికైన సంగెపు రాఘవేంద్రకు ఐదువేల రూపాయల చొప్పున ప్రధానోపాధ్యాయులు ఎడ్ల బిక్షం అందించారు.
కనగల్ మండలం రాయి బావి గూడానికి చెందిన నంద్యాల కిరణ్ కుమార్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన బొమ్మరబోయిన సైదులు అనే ఉపాధ్యాయుడి ద్వారా నగదు బహుమతిని పంపించినందుకు ప్రధానోపాధ్యాయులు వారిద్దరిని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈరోజు వారికి నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయిని కట్ట మమత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.