24-06-2025 05:26:00 PM
వృద్ధ దంపతులు ఆవేదన..
కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అసత్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నన్ను నా భర్తను మానసికంగా మాటలతో చంపాలని చూస్తున్నారని కేతపల్లి మండలా(Kethepalli Mandal)నికి చెందిన వృద్ధ దంపతులు కొప్పుల సునంద, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాజంలో మేము గౌరవంగా బ్రతుకుతున్నామని మా ఎదుగుదలను జీర్ణించుకోలేక కొప్పుల ప్రదీప్ రెడ్డి, జలంధర్ రెడ్డిలు మా కుటుంబంపై కేతపల్లి రెడ్డి సంఘం వాట్సప్ గ్రూపులో అసత్య పదజాలంతో అగౌరవంగా పోస్టులు పెడుతున్నాడని వారు ఆరోపించారు.
చిట్టి పొట్టి మాటలతో అసత్య పదజాలం వల్ల మమ్ములను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వీరికి మాకు భూములకు సంబంధించినటువంటి పంచాయితీలు ఉన్నాయన్నారు. మా ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. మా కుటుంబంపై నిందలు వేస్తూ మా పరువును సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ప్రదీప్ రెడ్డి, జలంధర్ రెడ్డిల వల్ల మా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు.