calender_icon.png 2 June, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

31-05-2025 12:00:00 AM

  1. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి
  2. ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మే 30 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల అమ్మకంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బం దికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు  ఎప్పటికప్పుడు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక పోలీ సు హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశ మందిరం లో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజనల్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో భారీగా  పెండింగ్ కేసులు, శాంతి భద్రతలు తదితర వాటిపై సమీక్షించారు.బీ మేరకు  జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల తో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కేసుల నమోదులో ఎలాంటి జాప్యం వహించకుండా ఉండాలని సూచించారు. రానున్నది వర్షాకాలంలో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తమై పోలీస్‌స్టేషన్‌లో అందుబాటు లో ఉండాలని సూచించారు.

రైతులు మోసపోకుండా నకిలీ విత్తనాలను చలామణిలో లేకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను గుర్తింపు పొందిన దుకాణ యజమానుల వద్ద పొందాలని ప్యాకెట్లపై సరైన లేబుల్, విత్తనం యొక్క తయారీ తేదీ, ఎక్స్‌ఫైరీ తేదీ పూర్తి వివరాలను కలిగి ఉండి దుకాణ యజమాని వద్ద బిల్లు గ్రహించాలని సూచించా రు.

బక్రీద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణా జరగకుండా చూడాలని, ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి  శ్రీనివాస్ పాల్గొన్నారు.