భారతదేశ అభివృద్ధిలో అనేక మార్పులు
06-04-2026 01:44 AM
విద్యుత్ శాఖ ఎస్ ఈ
ఖమ్మం టౌన్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల కోసం దేశ ఉప ప్రధానిగా పనిచేసి బాబు జగజీవన్ రావు అనేక సంస్కరణలు తెచ్చి భారతదేశ అభివృద్ధిలో వారు అనేక మార్పులు తెచ్చారని విద్యుత్ శాఖ ఖమ్మం సూపరిండెంట్ ఇంజనీర్ ఈ శ్రీనివాస చారి అన్నారు. ఖమ్మం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగజీవన్రావు 119వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసచారి, బాబు జగజీవన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. డిఈ, టెక్నికల్ బాబురావు, డిఈ విజిలెన్స్, వెంకటేశ్వరరావు, ఏవో మురళి, ఏఏఓ సీతారామ గోపాల్, ఎం ప్రసాద్, ఇమామ్ పాల్గొన్నారు.




