08-06-2025 05:43:49 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ శీతల పరమేశ్వరి (బొడ్రాయి) తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఆదివారం బొడ్రాయికి బోనాలు సమర్పించారు. మహిళలు తెల్లవారుజామున స్నానా ఆచరించి బోనాలను అందంగా అలంకరించి డప్పు చప్పులతో ఊరేగింపుగా బొడ్రాయికి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కూడా మహిళా భక్తులు పెద్దఎత్తున బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.