calender_icon.png 8 June, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఆర్టియుటిఎస్ భవన తొలి అంతస్తు ప్రారంభోత్సవం

08-06-2025 05:49:05 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన  హనుమకొండ, వరంగల్ జిల్లా పి ఆర్ టి యు టి ఎస్ భవన మొదటి అంతస్తుని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి(MLC Sripal Reddy) సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ... ఉపాధ్యాయులు ఎన్నికల్లో నిబద్ధతతో అండగా నిలిచారని ఈ వేదిక ద్వారా వారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయ వర్గం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులని అన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.

ఈ భవనం ఉపాధ్యాయ సంఘ సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని. భవిష్యత్తులో పి ఆర్ టి యు టి ఎస్ కు సంబంధించిన ఏవైనా అవసరాలుంటే మా దృష్టికి తీసుకు వస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టంగా తెలిపారు. పి ఆర్ టి యు టి ఎస్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో, విధ్యారంగ అభివృద్ధికి పాటుపడడంలో ముందుంటూ, ప్రభుత్వానికి మేలైన సలహాదారులుగా పనిచేస్తూ వస్తుందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సంస్థకు ఎమ్మెల్యే నాయిని హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అధికారులు, పి ఆర్ టి యు టి ఎస్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.