26 March, 2026 | 3:24 AM

అధికారులు సమన్వయంతో పని చేయాలి

26-03-2026 01:39 AM

ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ 

శంకర్ పల్లి; మార్చి 25.(విజయక్రాంతి): అధికారులు సమన్వయంతో పని చేయాలని శంకర్ పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ సూచించారు బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకయ్య ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సర్పంచులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అంశాలను చర్చించారు. అలాగే పారిశుద్ధ్య పనులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్తగా ఇందిర ఇండ్ల మంజూరి, పూర్తి అయిన ఇద్దరమ్మాయిలకు సంబంధించిన వివరాలపై చర్చించారు. గ్రామాలలో నిర్వహిస్తున్న నర్సీరీలను సక్రమంగా నిర్వహించాలని, వాటికి వారంలో రెండు మూడు సార్లు నీరు పట్టాలని ఎంపీడీవో సూచించారు. ఇంటి పనులు విషయంలో సమీక్ష సమావేశం జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజు, సూపరిండెంట్ గోపాలకృష్ణ, హౌసింగ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.