26 March, 2026 | 3:16 AM

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

26-03-2026 01:37 AM

ఆమనగల్లు, మార్చి 25(విజయక్రాంతి): ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఘన విజయం సాధించిన వేం నరేందర్ రెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం నియోజకవర్గ పరి ధిలోని పలు అంశాలపై వారు చర్చించారు. కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల సాధనకు తన వంతు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఎంపీని కోరారు. దీనికి స్పందించిన వేం నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ప్రగతికి సాధ్యమైనంత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.