23 June, 2026 | 11:02 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

03-09-2024 12:31 AM

రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం ఆయన సంగారెడ్డి మం డలం కల్పగూర్ శివారులోని మంజీరా బ్యారేజీని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులను సమీక్షించారు. ప్రాజెక్టులు, చెరువులు రక్షణకు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదల తో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. అనంతరం కల్పగూర్‌లో ముంపు బాధితుల సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. మంజీరా బ్యారేజీలోకి వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు గ్రామాల ప్రజలకు సూచించారు. బ్యారేజీని ప్రభుత్వం టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తుందన్నారు. పర్యటనలో కలెక్టర్ క్రాంతి వల్లూర్, ఎస్పీ చెన్నూర్ రూపేశ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఉన్నారు.