27-11-2025 05:17:53 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): ఇంగ్లీష్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఒలింపియాడ్ ను, ఏడికిష్టను తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల కన్వీనర్ ఎల్లబోయిన కృష్ణవేణి ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులకు గురువారం నిర్వహించారు. ఈ మేరకు ఆంగ్లంలోని గ్రామర్, ప్యాసేజీలపై 50 మార్కులకు పరీక్ష నిర్వహించగా విద్యార్థులు వి గోపీచంద్, మగ్దూం, భవిష్య, అర్చన మంచి మార్కులు సాధించారని వీరిని జిల్లా స్థాయికి పంపనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు యం సురేందర్, యాకన్న, తిరుమల్ రెడ్డి, రవికుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.