15 April, 2026 | 9:10 AM

జిల్లా కేంద్రానికి చేరిన ఎన్నికల పరిశీలకులు

27-11-2025 05:19 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు సాధారణ పరిశీలకులుగా సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య నియమించబడ్డారు. ఈ నేపథ్యంలో వారు గురువారం జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్, అబ్జర్వర్‌లకు పూల మొక్కను అందించారు. అనంతరం ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.