3 July, 2026 | 10:08 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఒకే దేశం ఒకే ఎన్నిక.. జేపీసీ గడువు పెంపు

25-03-2025 11:48 PM

ఆమోదం తెలిపిన లోక్‌సభ..

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ పదవీకాలన్ని పొడిగించేందుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పీపీ చౌదరీ లోక్‌సభలో కమిటీ పదవీకాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా.. వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. రాజ్యసభ నుంచి కొత్త సభ్యుడికి కూడా పార్లమెంటరీ కమిటీలో స్థానం కల్పించినట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ సభకు తెలిపారు.

ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేయడంతో 39 మంది సభ్యుల కమిటీలో ఒక పోస్టు ఖాళీ కావడంతో కొత్త సభ్యుడికి చోటు కల్పించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లును అధ్యయనం చేసేందుకు 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఏర్పాటయింది. కమిటీలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఉండగా.. బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.