17-02-2026 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఒక్కపూట బడులు మార్చి 16 నుంచి ప్రారంభమవు తాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు అం దిస్తారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాలను కేటాయించిన బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నడుస్తాయి. పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుండగా, జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.