17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కిలో వెండి రూ.2.37లక్షలు

27-12-2025 01:38 AM

తొమ్మిది రోజుల్లోనే ధర రూ.29 వేలు పెరుగుదల

హైదరాబాద్, డిసెంబర్ 26(విజయక్రాంతి): వెండి ధరలు ధగధగ లాడుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో  రోజురోజుకూ సిల్వర్ ధరలు ఆకాశానం టుతూ రికార్డులు కొల్లగొడుతూ పరుగు తీస్తోంది. హైదరాబాద్‌లో శుక్రవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2.37 లక్షలు పలికింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఒక దశలో రూ.1.42,800లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటి ధరలు విపరీతంగా మండుతున్నాయి. ఔ న్సు పసిడి ధర 4,507 డాలర్లు, వెండి ధర 75 డాలర్లకు చేరింది. ఈ నెల 18 నుంచి వెండి ధర దాదాపు రూ.29 వేలు (14.33 శాతం) పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటికే పసిడి ధర దాదాపు 70శాతం వరకు ఎగబాకింది. 1979 తర్వాత ఇదే అతిపెద్ద వార్షిక లాభమని నిపుణులు పేర్కొంటున్నారు. 2026 ప్రారంభంలోనూ ఈ లోహాల ధర లు పరుగులు పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు.