calender_icon.png 30 May, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఒకరు మృతి

28-05-2025 11:09:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) దిల్వార్పూర్ మండలం కాల్వ తండాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన అంగోత్ కనిరాం(40) అనే వ్యక్తి పెండ్లి విందులో చికెన్ తిని ముక్క గొంతులో తట్టుకోవడంతో అస్వస్థకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సిర్గాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్న కనిరాం భోజనం చేసిన వెంటనే గొంతులో ఏదో రకమైన నొప్పి రావడంతో అస్వస్థకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను నిర్మల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కానీ రామ్ భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.