28-05-2025 11:14:15 PM
ఎస్సై గుత్తా వెంకటరెడ్డి..
చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గట్టుప్పల్ ఎస్సై గుత్తా వెంకటరెడ్డి(SI Gutta Venkata Reddy) సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో మంచి చెడు తెలియజేసే వయస్సులో యువత నిజమైన మార్గాన్ని ఎంచుకుంటే వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి గొప్ప స్థానాలకు చేరగలగతారు అని అన్నారు. చెడు అలవాట్లు ముఖ్యంగా మత్తుపదార్థాల వాడకంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే ఆ ప్రభావం కేవలం వ్యక్తికి మాత్రమే కాదు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికి బాధను కలిగిస్తుందని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యంపై, కుటుంబంపై, భవిష్యత్పై ఏర్పడే తీవ్ర పరిణామాల గురించి యువతకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే నేటి టెక్నాలజీ ప్రభావంతో చిన్నవయసులోనే సెల్ఫోన్ల వాడకం పెరిగిందని, దీని వల్ల ఆలోచనా శైలి మారిపోతుందని తెలిపారు. పిల్లలకు సెల్ ఫోన్ వాడకాన్ని పరిమితి వరకు నియంత్రించడం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరం అని స్పష్టం చేశారు. ఇలాంటి సందేశాలు యువతలో చైతన్యం కలిగించి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించగలవని ఎస్సై వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.