28-05-2025 11:03:24 PM
పెద్దపల్లి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి...
మంథని (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో మన దేశ సత్తా ఏంటో పాకిస్థాన్ కి చూపించామని పెద్దపల్లి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి(Chandrupatla Sunil Reddy) అన్నారు. బుధవారం మంథని పట్టణంలో తిరంగా యాత్రలో సునీల్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... భారత దేశ సైనికుల విరోచిత పోరాటంతో పాకిస్తాన్ ఉగ్రముకల భరతం పట్టి ప్రపంచ యవనికపై భారత జాతి కీర్తి ప్రతిష్టలను సగర్వంగా చాటిన వీర సైనికుల విజయోత్సవాన్ని పురస్కరించుకొని మంథని నియోజకవర్గ కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ ర్యాలీలో రాజకీయ పార్టీలకు మతాలకు అతీతంగా జాతీయ వాదులు, ఆపరేషన్ సిందూర్ మద్దతు దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు.
పహాల్గం ఉగ్రదాడికి దిటైన జవాబు అని, శత్రువు దేశాలకి భారత్ దేశ సత్తా ఏంటో అర్థం అయిందని, సింధు జలాలు పాకిస్థాన్ కి చుక్క నీరు లేకుండా చేసి, ఉగ్రవాదులు దాడికి పతీకారంగా చేయడమే కాకుండా, పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలను నెల మట్టం చేసి వందలకి ఉగ్రవాదులను మట్టు పెట్టింది, భారత్ వైపు కన్ను ఎత్తి చూడాలంటే భయం పుట్టేలా నరేంద్ర మోడీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లా నారాయణ రెడ్డి, కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, మల్కా మోహన్ రావు, పోతారవేణి క్రాంతికుమార్, సబ్బానీ సంతోష్, విరావేన రాజేందర్, కొయ్యడ సతీష్, మారం శ్రీనివాస్ రెడ్డి, మేడిపల్లి పూర్ణ చందర్, పాగే రంజిత్, రాంశెట్టి మనోజ్, కొండ్రు లక్ష్మణ్, ప్రభాకర్, కొత్త శ్రీనివాస్, తొట్ల రాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.