12-06-2025 08:09:28 PM
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్(Ahmedabad CP Gyanendra Singh Malik) పేర్కొన్నారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి 11ఏ నంబర్ సీటులోని ప్రయాణికుడు బయటపడ్డాడు. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రమాద మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని, నివాస ప్రాంతంలో కూలినందువల్ల మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని సీపీ జీఎస్ మాలిక్ వ్యాఖ్యానించారు.