11-06-2025 01:26:08 AM
హుస్నాబాద్, జూన్ 10 : పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ పనులతో పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
సిద్దిపేట రోడ్డులోని తిరుమల గార్డెన్ సమీ పంలో డ్రైనేజీలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఇది పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు. అంతేకాకుండా, 30 మంది స్ట్రీట్ వెండర్లకు యూబీఐ బ్యాంకులో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. ఇది ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన పీఎంజేజేబీవై (ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన), పీఎం ఎస్బీవై (ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన) పథకాల కిందకు వస్తుంది.
ఈ కార్యక్రమాల అనంతరం, మహిళా సంఘాల కోసం సివిల్ హాస్పిటల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సంపత్ రావు, సూపరింటెండెంట్ రమేశ్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజీవ్, పర్యావరణ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.