11-11-2025 01:02:23 AM
బస్తాలు ఎత్తుకెళ్లిన ప్రజలు
నల్లగొండ జిల్లా ఏపీ లింగోటం వద్ద ఘటన
చిట్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఉల్లిగడ్డల లారీ జాతీయ రహదారి 65పై సోమవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్స్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న ప్రయాణికులు మాత్రం వారి వాహనాలను పక్కన నిలిపి, ఉల్లిగడ్డ బస్తాలను ఎత్తుకెళ్లారు. లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్ ఇబ్బందుల్లో ఉండగా, మానవత్వం మరిచి దొరికిందే అవకాశంగా భావించి ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్లారు.