calender_icon.png 1 May, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే డే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాడుదాం

01-05-2025 05:57:11 PM

సామ్రాజ్యవాదం, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థలను వ్యతిరేకించండి..

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం..

వైరా (విజయక్రాంతి): చికాగో నగరంలో పెట్టుబడిదారుల తుపాకులకు ప్రాణాలను బలిదానం చేసిన కార్మికుల పోరాట చరిత్రను, త్యాగాలను స్మరించుకుంటూ మే డే పోరాట స్పూర్తితో శ్రమ దోపిడీ, అసమానతలు, సామ్రాజ్యవాదం, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా కార్మికులు నిరంతరం పోరాడాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మే డే ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం బోడేపూడీ వెంకటేశ్వరరావు భవనం వద్ద డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, రింగ్ రోడ్డు సెంటర్ వద్ద పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు పార్టీ జెండాలను ఎగురవేశారు.

వైరా మున్సిపాలిటీ పరిధిలోని  గండగలపాడు, సోమవారం, లాలాపురం, పల్లిపాడు, దిద్దుపుడి, బ్రాహ్మణపల్లి, హనుమాన్ బజార్, సుందరయ్య నగర్, లిలా సుందరయ్య నగర్ లలో సీనియర్ నాయకులు పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం డప్పు‌ దళంతో వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు సిఐటియూ, పార్టీ జెండాలను ఎత్తుకుని మే డే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి నినదిస్తూ వైరా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో భూక్యా వీరభద్రం రిక్షా తోక్కి కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. బైకులు, ఆటోలు కూడా భారీగా  పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ... కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా మారుస్తున్నారని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజేపి ప్రభుత్వం ఉగ్రవాదులు దాడులతో రాజకీయం చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మతాల మధ్య గొడవలను సృష్టించి ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుందని విమర్శించారు. లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ దేశంలో అలజడిని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మికులందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని కోరారు. మే డే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, డివిజన్ కమిటీ సభ్యులు దోడ్డపనేని కృష్ణార్జునరావు, తూము సుధాకర్, నాయకులు, హరి వెంకటేశ్వరరావు, గుడిమెట్ల రజిత, బొంతు సమత, గుమ్మా నరసింహారావు, గుడిమెట్ల మోహన్ రావు, అనుమోలు రామారావు, కొంగర సుధాకర్, కామినేని రవి, ఎస్.కె నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, షేక్.జమాల్ సాహేబ్, బాజోజు రమణ, బోడేపూడి వీరభద్రం, మల్లెంపాటి వీరభద్రరావు, మల్లేంపాటి రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, కంసాని మల్లికాంబ, సంక్రాంతి పురుషోత్తమరావు, బెజవాడ వీరభద్రం, పాపగంటి రాంబాబు, యనమద్ది రామకృష్ణ, ఓర్పు సీతారాములు, చింతనిప్పు సులోచన, మాడపాటి మల్లికార్జున్ రావు, మాడపాటి వెంకటి, నూకల వెంకటేశ్వరరావు,అమరనేని కృష్ణ , మాడపాటి రామారావు, భూక్యా విజయ, బత్తుల ప్రమీల, చావా కళావతి, తాటి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.