calender_icon.png 5 September, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య శిబిరాలు ఏర్పాటు

05-09-2025 07:57:11 PM

వడ్డేపల్లి (విజయక్రాంతి): వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Shabarish) ఆదేశాల మేరకు 12 ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు, 108 వాహనాలను కూడా అందుబాటులో ఉంచినట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య తెలియజేశారు. మూడు షిఫ్ట్ లలో కూడా వైద్యాధికారి సిబ్బందిని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గురువారం బంధం చెరువు, సిద్దేశ్వరగుండం, హసన్ పర్తి సందర్శించి, శుక్రవారం కటాక్షపూర్, పెద్దాపూర్ చెరువు, ప్రగతి సింగారం బ్రిడ్జి, గుండ్ల సింగారం చెరువు, కమలాపూర్, హసన్ పర్తి, సిద్దేశుని గుండం, బంధం చెరువు లలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరములను ఆయన సందర్శించి తగు సూచనలు చేయడం జరిగింది.

ఒక్కో షిఫ్టుకు 60 మంది చొప్పున మొత్తం 180 మంది వైద్య సిబ్బందిని డిప్యూటేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాలలో చిన్నచిన్న రుగ్మత లకు 168 మందికి చికిత్స అందించడము జరిగిందని ఆయన వివరించారు. వైద్యాధికారులు డాక్టర్ స్వాతి, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్ నవీన్, డాక్టర్ కవిత, డాక్టర్ రోహిత్, డాక్టర్ విజయ రెడ్డి, డాక్టర్ ఇర్ఫాన్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ సురేష్, డాక్టర్ సాయిశ్రీ  సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.