1 August, 2026 | 6:06 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •  

విద్యార్థులు గ్రామీణ అభివృద్ధి మధ్య వారధిగా మారాలి

19-12-2025 10:07 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత భారత్ అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  ప్రాంతీయ సమన్వయకర్త ఉన్నత భారత్ అభియాన్ డాక్టర్ దేబేంద్ర నాథ్ దాస్ మాట్లాడుతూ... విద్యార్థులు, గ్రామీణ ప్రజలు, అభివృద్ధి మధ్య వారధిగా మారాలని సూచించారు.

గ్రామీణాభివృద్ధికి జ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి వాటి అమలు (ఎగ్జిక్యూషన్) ఎంతో కీలకమని అన్నారు. అలాగే నైపుణ్యాల వృద్ధి (స్కిల్ ఎన్‌రిచ్‌మెంట్) ద్వారా గ్రామీణ సమస్యలకు పరిష్కారాలు సాధ్యమని, ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు.