calender_icon.png 1 July, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోల్‌మోడల్ మన అంగన్వాడీలు

01-07-2025 02:54:35 AM

  1. పౌష్ఠికాహారం, బోధనలో అగ్రగామి
  2. పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య
  3. రవాణా, దేవాదాయ, ఐటీ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు
  4. సంక్షేమ శాఖలతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాం తి): తెలంగాణ అంగన్వాడీలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్ఠికాహారం అందించడంతో పాటు వారికి ఐదేళ్లు వచ్చే వరకు పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సీఎం సూచించారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వ యోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖలపై సోమవారం తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ భవనాలు నిర్మించే విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలని సీఎం పేర్కొన్నారు.

సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్‌తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం, ఎక్కువ సౌ కర్యం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డా రు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలని, ఇందుకు ఎన్జీవోల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను విని యోగిస్తున్నారని, పౌష్ఠికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైనా దృష్టి సారించాలని ఆదేశించారు.

అంగన్వాడీల పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కలిసే పని చేయాలని సీఎం అన్నారు. అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారని, అదే సమయంలో ఏటీసీల్లోనూ వాళ్లకు ప్రవేశాలు కల్పించాలని అధికారులను ఆదేశిం చారు.

సింగపూర్‌లోని నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపే వారిలో అనాథ పిల్లలకు చోటు కల్పించాలని ఆదేశించారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి, పౌష్ఠికాహారం అందేలా చూ డాలని ఆదేశించారు.

విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఆయా పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచిం చారు. తెలంగాణ ఫుడ్స్, విజయా డెయిరీ ఉత్పత్తులను అంగన్వాడీలకు అందేలా చూడాలని సీఎం అన్నారు..

వృద్ధులకు భరోసా

ఉద్యోగాలు చేస్తున్న పలువురు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అటువంటి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవా ల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించి, నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ట్రాన్స్‌జెండర్లకు ప్రస్తు తం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీ ల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రైజింగ్--2047 డాక్యుమెంట్‌లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృ ద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలు రూ పొందించాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిధ పథకాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహాకాలు కల్పించే విషయంపై అధ్యయనం చేసి వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించా రు. సమీక్షలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్దుల శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన తదిత రులు పాల్గొన్నారు.